1. 132 కిలోల గంజాయి స్వాధీనం — ఒకరు పరారీ

1. 132 కిలోల గంజాయి స్వాధీనం — రెండు పుస్తకాలు — ఒకటి పరారీ

అమీర్‌పేట ఎస్ ఆర్ నగర్‌లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పోలీసులు 1.132 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి అమ్ముతున్న సయ్యద్ వాజిద్ రుమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ అజార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని సీఐ బిక్ష రెడ్డి తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న బృందంలో ఎస్ఐలు బాలరాజు, సంధ్య, కానిస్టేబుళ్లు సంతోష్, లక్ష్మణ్, అనిష్, నితిన్ ఉన్నారు.

గంజాయిని స్వాధీనం చేసుకున్న బృందాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment