కొత్త ఏడాదిలో కొత్త రూల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం తప్పని, ఎలాంటి ఉత్తర్వులూ వెలువరించలేదని పేర్కొంది. చెక్కులపై రాతకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదని స్పష్టంచేసింది.