కశ్మీర్ సహా అన్ని అంశాలపైనా శాంతి చర్చలు: పాక్ ప్రధాని
శాంతి స్థాపన కోసం చర్చలు జరుపుదామంటూ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ భారత్కు ప్రతిపాదన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపైనా మాట్లాడుదామని సూచించారు. బుధవారం ముజఫరాబాద్లో జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్ సంఘీభావ దినం పేరుతో ప్రతియేటా ఇక్కడ సమావేశాన్ని జరుపుతుంటారు. ఆయన ప్రసంగిస్తూ చర్చలు ద్వారానే కశ్మీర్ సహా అన్నిసమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు.