నేటి నుంచి ఎండల తీవ్రత అధికం…
* తెలంగాణలో నేటి నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది.
* ప్రతి రోజూ దాదాపు 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
* నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
* మే నెల వరకు తీవ్రమైన వడగాల్పులు వస్తాయని, ప్రజలు తగిన జాగ్రతలు తీసుకోవాలని IMD సూచించింది.
* చిన్నపిల్లలు, వృద్ధులను బయటకు పంపొద్దని నిపుణులు చెబుతున్నారు.