బోణి కొట్టిన హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ టీం 

బోణి కొట్టిన హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ టీం

హైదరాబాద్, మార్చి23, సమర శంఖం ప్రతినిధి:-

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025ను విజయంతో ప్రారంభిం చింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో, అది రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది.

ఈ విజయానికి ఇషాన్ కిషన్ అతిపెద్ద హీరో. మొద ట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేవలం 47 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్‌తో 107 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 6 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ కారణంగా, హైదరాబాద్ జట్టు 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

దీనికి ప్రతిస్పందనగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు 242 పరుగులు చేయగలి గింది. ఈ విధంగా SRH ఈ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలిచింది. సంజు సామ్సన్, ధ్రువ్ జురెల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను తమకు అనుకూ లంగా మార్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారు విజయం సాధించలేకపో యారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

రాజస్థాన్ రాయల్స్

యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ.

హైదరాబాద్ లో పరుగుల వర్షం

ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల రికార్డు నమోదు చేసింది. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 24 పరుగుల వద్ద అవుటయ్యాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇషాన్ కిషన్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. క్లాసేన్ ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నాడు. హైదరాబాద్ బ్యాటర్లు దంచి కొడుతుండటంతో భారీ పరుగులు సాధించే దిశగా స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది.

భారీ స్కోరు దిశగా…

ఓవర్ రన్ రేట్ 14 కు పైగానే ఉంది. 20 ఓవర్లకు 286 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పో యింది. గతంలో నూ ఇదే ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 280 పరుగులు చేసి ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు నమోదు చేసింది.

ఈ రికార్డును అధిగమించా లన్న తపన సన్ రైజర్స్ లో కనిపిస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ను అలవోకగా కొడుతుండటంతో రికార్డులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది.

ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండటం చేతిలో వికెట్లు ఉండటంతో భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఆఫ్ హైదరా బాద్ రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచే అవకాశం ఉంది. చివర్లో షాట్లు కొట్టి వరసగా అవుటయినా 20 ఓవర్లకు 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కు 287 లక్ష్యాన్ని ముందు ఉంచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment