గోల్డ్ బాండ్ స్కీం 4 కేజీల 940 గ్రాములు బంగారం అందజేత ద్వారకాతిరుమల,మేజర్ న్యూస్: చిన్న వెంకన్న స్వామి వారి హుండీలు ద్వారా వచ్చిన బంగారు మిశ్రమము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి కాలేశ్వరం మార్కెట్ విజయవాడ వారికి గోల్డ్ బాండ్ స్కీమ్ నిమిత్తం4 కేజీల950 గ్రాములు మంగళవారం ఉదయం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్ వి ఎస్ ఎన్ మూర్తి డిప్యూటీ ఈవో పీ బాబురావు వి వి పల్లంరాజు జువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ రాజమహేంద్రవరం మరియు కమిటీ సభ్యుల సమక్షంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ వారికి అప్పగించడమైనది.ఈ క్రమంలో ఆలయ ఏఈవో నటరాజ్, శ్రీనివాస్,సూపరింటెండెంట్ రమణ రాజు తదితరులు ఉన్నారు.
గోల్డ్ బాండ్ స్కీం 4 కేజీల 940 గ్రాములు బంగారం అందజేత
Published On: May 20, 2025 8:51 pm
