ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు అవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళితే మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామంలోని ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వారికి రావాల్సిన డబ్బుల కోసం గత మూడు సంవత్సరాల క్రితం నుంచి గొడవలు నడుస్తూ వచ్చాయి. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తికి తిమ్మప్ప అనేవ్యక్తి మూడు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ పొలం దున్నిన డబ్బులు 15 వేల రూపాయలు ఇవ్వాలి. అయితే తిమ్మప్ప చనిపోవడంతో భార్య జములమ్మ (36)ను అడుగుతూ వచ్చారు ట్రాక్టర్ ఓనర్ రాజు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఒక కుటుంబానికి చెందిన రాజు (42), ఆంజనేయులు (34), లక్ష్మన్న(30), బీసన్న(27), శివ(17) అనే నలుగురు మరో కుటుంబం పై దాడి చేయడంతో సరోజమ్మ(65), జములమ్మ(36), పరుశురాముడు (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సరోజమ్మ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
డబ్బుల కోసం దాడి.. ఒకరి పరిస్థితి విషమం.
Published On: December 28, 2024 8:44 pm
