నిషేధిత చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చైనా మాంజా విక్రయాలపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజాతో ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment