సంబర్మతి ఆశ్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమం సందర్శించి జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మాగాంధీ గారి జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు.