అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షా కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల ధర్నా.

పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 18 సమర శంఖమ్ 

కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ ను నిన్న రాజ్యసభలో అవమానిస్తూ , వ్యంగ్య వ్యాఖ్యలచేసిన దానికి నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు అంబేద్కర్ చిత్రపటాలు ప్రదర్శిస్తూ పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేపట్టారు. అమిత్ షా అంబేద్కర్ పై మరియు రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. బిజెపి , ఆర్ఎస్ఎస్ లకు రాజ్యాంగం పై నమ్మకం లేదు..గౌరవం కూడా లేదా అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పెద్దలు చరిత్రను మార్చే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. బీజేపీ కి గత పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేవారని రాజ్యాంగాన్ని , రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరచడం సిగ్గుమాలిన చర్య అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment