ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు

* టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ వేగవంతం

* “ఆక్వా ఐ” పరికరాన్ని టన్నెల్ లోకి పంపించిన నేవీ

* టన్నెల్ లోపల పెద్దమొత్తంలో బురద, నీరు ఉన్న కారణంగా బాధితుల వద్దకు చేరుకోవడం కష్టతరమైపోయింది.

* ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దిగేలా చేసింది.

* ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఒక ప్రమాదకరమైన విధానం.

* ఇది సాధారణంగా బొగ్గు గనుల నుండి బొగ్గును వెలికి తీయడంలో ఉపయోగపడుతుంది.

* ఈ విధానం ద్వారా, గనుల్లో సన్నని, సమాంతర మార్గం ఏర్పరచి, బొగ్గు పొర వరకు చేరుకొని, ఆ పొరను బయటకు తీసేందుకు గుంతలను తవ్వుతారు.

* ఈ గుంతలు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండటంతో, ఒక్క వ్యక్తి మాత్రమే ఆ మార్గంలో ప్రయాణించగలుగుతుంది.

* ఈ విధానంలో, మరింత సురక్షితంగా, ప్రత్యేక పనిముట్లతో, రోప్‌లు, నిచ్చెనల సాయంతో, కార్మికులు గనులలోకి ప్రవేశించి పనులు చేపడతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment