ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం

ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు.లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment