నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ….. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (gsdp) 15.02 లక్షల కోట్లు, వృద్ధిరేటు 14.5%. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలగా ఉందని తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా రైతులు, సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తున్నాం అనేదే మెరుగైన ప్రయాణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భాగస్వామిగా ఉందని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుంది, భూగర్భ జల వనరులు పెరిగాయి హైదరాబాద్ పరిసరాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలి గత పది సంవత్సరాలు సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారు. ఐకెపిల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి . వ్యవసాయ పంపు సెట్లు క్రమంగా సోలార్ పవర్ పంపుసెట్లుగా మార్చేందుకు దృష్టి సారించాలి .గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీడర్ గా నిలపాలి

Join WhatsApp

Join Now

Leave a Comment