పాశమైలారం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన మాజీ ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్
– క్రీడాకారులను అభినందించి, ఫైనల్ మ్యాచ్ వీక్షించిన పటాన్ చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్
మహాశివరాత్రి సందర్భంగా పటాన్ చెరు మండలం పాశమైలారం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు వీక్షించి, క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం ఆటగాళ్లను అభినందించి, క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఇటువంటి పోటీలు యువతకు ఉత్తేజాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.