నడి రోడ్డుపై కన్న తండ్రిని పొడిచి చంపిన కసాయి కొడుకు
హైదరబాద్ ఫిబ్రవరి 21, సమర శంఖం:- నగరంలో ఈ మధ్య దారుణ హత్యలు పెరిగిపోతున్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అలాంటి ఘటనే శనివారం మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టపగలే ఓ కుమారుడు తన తండ్రిని విచక్షణ రహితంగా పొడిచి చంపాడు
పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద తండ్రిపై కుమారుడు దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు.
బస్టాప్ వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే బాధితుడిని సమీపంలోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తండ్రి మొగిలి మద్యానికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడని కుమారుడే ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కూడా మొగిలి హత్యకు కారణాలుగా పోలీసులు గుర్తించారు.
నిందితుడు సాయి(25) హత్య చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి, మృతుడు సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిగా, నిందితుడిని అతని కుమారుడు సాయి కుమార్గా గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.