కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి: కేసీఆర్

 

బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని తెలిపారు. నాడు రైతుబంధు తీసుకువచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ తెలియజేయాలి. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి. విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా..!! సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ… మార్పులు చేసుకుంటూ పోతే ఎలా. ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది… పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయంపై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగడతాం. ఫిబ్రవరి తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం.ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేపడతాం” అని కేసీఆర్ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment