అత్యాధునిక నైపుణ్య శిక్షణ కోసం ‘ఆస్ట్రేలియా యూనివర్సిటీ’: మంత్రి శ్రీధర్ బాబు

అత్యాధునిక నైపుణ్య శిక్షణ కోసం ‘ఆస్ట్రేలియా యూనివర్సిటీ’: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 30, సమర శంఖం ప్రతినిధి: రాష్ట్రంలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించే యూనివర్సిటీ ఏర్పాటుకు ఆస్ట్రేలియా వాణిజ్య ప్రతినిధులు ముందుకు రావడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. తాము నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయానికి తోడు మరో ఉన్నత స్థాయి టెక్నాలజి క్యాంపస్ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయని ఆయన అన్నారు.

మంగళవారం సచివాలయంలో తనను కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధులతో శ్రీధర్ బాబు బేటీ అయ్యారు. కృత్రిమ మేథ వేగంగా విస్తరిస్తున్నందున గ్లోబల్ సామర్థ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 3 లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో పాటు, చదువులు పూర్తి చేసుకునే విద్యార్థులకు నూతన నైపుణ్యాల శిక్షణ అవసరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ విద్య – పరిశ్రమ అవసరాలకు మధ్య నైపుణ్య లేమికి సంబంధించిన అగాధం ఉంది. దీన్ని పూడ్చగలిగే అత్యాధునిక శిక్షణ కేంద్రాలు పెద్ద ఎత్తున్న రావాల్సిన అవసరం ఉంది. తమ యూనివర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు సృష్టిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు చెబ్తున్నారు. పూర్తి వివరాలతో, స్పష్టమైన ప్రతిపాదనతో వస్తే ప్రభుత్వపరంగా ఏం చేయగలుగుతామో ఒక అభిప్రాయానికి రాగలుతాం. యూనివర్సిటీకి అనుబంధంగా ఇన్ క్యుబేషన్ కేంద్రాలు, పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుంది. శాటిలైట్ల నిర్మాణం, డ్రోన్ టెక్నాలజి 3-డి డిజైనింగ్, బయో సైన్సెస్, , సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో శిక్షణ అందించడానికి కరికులమ్ సిద్ధం చేసామని అంటున్నారు. మేం ఇప్పటికే టి-వర్క్స్ లో 3-డి ప్రోటో టైపింగ్ సేవలు అందిస్తున్నాం. అంకుర సంస్థల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాం’. వాటిని సందర్శించి అదనంగా ఏం చేయగలుగుతారో వెల్లడించాలని శ్రీధర్ బాబు సూచించారు.

మంత్రిని కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంలో సిడ్నీ బోర్గ్, నీలిమా చౌదరి, హైడన్ షటిల్ వర్త్, సురేన్ పథర్, యాండ్రే స్కోమన్, కొల్లా నాగ లోకేశ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment