ఉప రాష్ట్రపతికి స్వాగతం తెలిపిన: ఎంపీ రవిచంద్ర
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం ఘన స్వాగతం పలికారు.సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు గాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ తన ధర్మపత్ని డాక్టర్ సుధేష్ ధనఖర్ తో కలిసి ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా ఎంపీ రవిచంద్ర పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించి వారికి హృదయపూర్వక స్వాగతం చెప్పారు.