రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్.
తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్..
గత సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పిట్ట రామ లక్ష్మీ (78) ని చంపి తినేసిన వీధి కుక్కలు..
ఈ విషయంపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, కలెక్టర్ ను పూర్తి నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్..
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమర్పించిన నివేదిక నిర్లక్ష్యపూరితంగా ఉందని, అతను ఇచ్చిన నివేదిక పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డ జాతీయ మానవ హక్కుల కమిషన్..!!