భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మే 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

కోనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన జాగ్రత్తలు పాటించాలి

పెద్దపల్లి, మే 23, సమర శంఖం ప్రతినిధి:- రానున్న 3 నుంచి 4 రోజులపాటు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మన పెద్దపల్లి జిల్లాలో మే 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ధాన్యం కొనుగోలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు. రైతులు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, విక్రయించని ధాన్యం భద్రపర్చుకోవాలని, వాతావరణంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలని, వర్షాలు కురిసే నేపథ్యంలో ధాన్యం తడువకుండా టార్ఫాలిన్ కవర్లు కప్పాలని కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment