పీఎంజేజేబివై పథకం క్రింద రూ. 2,00,000 భీమా చెక్కును పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

పీఎంజేజేబివై పథకం క్రింద రూ. 2,00,000 భీమా చెక్కును పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:-

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా 436 రూపాయల ప్రీమియంతో 2 లక్షల రూపాయల భీమా లభిస్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో పిఎంజేజేబివై పథకం కింద సంబంధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన క్రింద గత 2 సంవత్సరాలలో పెద్దపెల్లి జిల్లా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా 20 మందికి భీమా క్లెయిమ్ సెటిల్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు సంవత్సరానికి 436 రూపాయల ప్రీమియం చెల్లించి పిఎంజేజేబివై లో చేరవచ్చని, 55 సంవత్సరాల వయసు వరకు ప్రీమియం రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు. భీమా కట్టిన వారు సాధారణంగా 30 రోజుల తరువాత మరణిస్తే, ప్రమాదవశాత్తు 24 గంటల తరువాత మరణిస్తే, దరఖాస్తు చేసుకున్న 5 పని దినాలలో రెండు లక్షల రూపాయల భీమా సొమ్ము అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రస్తుతం పీఎంజేజేబివై ప్రీమియం చెల్లించిన నూనె రవి గుండెపోటుతో మరణించడంతో అతని భార్య నూనె లక్ష్మికి డెత్ సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకున్న 5 రోజులలో భీమా సోమ్ము 2 లక్షల రూపాయల చెక్కు అందించామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రజలంతా పీఎంజేజేబివై పథకాన్ని వినియోగించుకోవాలని తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ మోహన్ సాయి, తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Leave a Comment