పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్‌బిఐ బ్యాంక్‌ దొపిడి దొంగల ముఠా సభ్యులు.

గత నెల 18వ తేదీన అర్ధ్రరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బిఐ బ్యాంక్‌లో దోపిడికీ పాల్పడిన ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు ఒక కోటి ఎనబై లక్షల నాలగువేల రూపాయల విలువ గల రెండు 2కిలోల 520 గ్రాముల బంగారు అభరణాలు, ఒక కారు, పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన వారిలో అర్షాద్‌ అన్సారీ, తండ్రి పేరు అన్సారీ ఆహ్మద్‌, వయస్సు 34, షేహవాజ్‌పూర్‌, బుడాన్‌ తాలుకా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. షాఖీర్‌ఖాన్‌ ఆలియాస్‌ బోలెఖాన్‌, తండ్రి పేరు నవాబ్‌ ఖాన్‌, వయస్సు 28, బుడాన్‌ తాలుకా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. హిమాన్షు బిగాంచండ్‌ జాన్వర్‌, తండ్రిపేరు బిగాం చంద్‌, వయస్సు 30, మోటల గ్రామం, తాలుకా, బుల్దనా జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు కాగా.ప్రస్తుతం పరారీలో వున్న నిందితుల వివరాలు: మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌, తండ్రి పేరు జకీర్‌ అలీ, వయస్సు 39, కక్రలా గ్రామం, బదౌన్‌ జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. అక్షయ్‌ గజానన్‌ అంబోర్‌, తండ్రి పేరు గజానన్‌, వయస్సు 24, సైగావ్‌ గ్రామం, చికిల్లి తాలుకా, మహరాష్ట్ర. సాగర్‌ భాస్కర్‌ గోర్‌, తండ్రి భాస్కర్‌ గోర్‌, వయస్సు 32, పునై మోటాల గ్రామం, బుల్దానా జిల్లా, మహరాష్ట్ర. సాజిద్‌ ఖాన్‌, తండ్రిపేరు జకీర్‌ అలీ ఖాన్‌, వయస్సు 35, కక్రలా గ్రామం, బడాయు జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గుర్తించబడ్డారు.ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులతో పాటు, పరారీలో మరో నలుగురు నిందితులు ఏడుగురు సభ్యులు ముఠా ఏర్పాడ్డారు. పరారీలో వున్న ప్రధాన నిందితుడు మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ కొద్ది రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో వుండే బ్యాంక్‌లు, బ్యాంక్‌ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితులకలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడం జరిగింది. సేకరించిన సమచారంలో నిందితులు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ చోరీ అనువైనదిగా గుర్తించి ఈ బ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఈ ముఠా సిద్దపడ్డారు. ఈ చోరీలో భాగంగా నవంబర్‌ 18తేది అర్ధరాత్రి తెల్లవారితే 19 తారీకున హైదరాబాద్‌ నుండి నిందితుల్లో ఒకడైన హిమాష్షు డ్రైవింగ్‌ చేస్తున్న ఒక కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని కారుని వెనక్కి తిప్పి పంపారు.అనంతరం మిగిత అరుగురు నిందితులు పంటపోలాల ద్వారా రాయపర్తి కేంద్రంలోని ఎస్‌బిఐ బ్యాంక్‌ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకోని అక్కడ వున్న కిటీకిని నిందితులు తోలగించి బ్యాంక్‌ లోనికి చోరబడ్డారు. ఈముఠా సభ్యులు ముందుగా బ్యాంక్‌ సెక్యూరీటీ అలారంతో పాటు, సిసి కెమెరాల వైర్లను నిందితులు కట్‌ చేసారు. ఇద్దరు నిందితులను తొలగించిన కిటీకి వద్ద కాపలగా వుంచి ప్రధాన నిందితుడితో సహ మరో నలుగురు నిందితులు బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టి, స్ట్రాంగ్‌ రూంలో వున్న మూడు లాకర్లను ఈ ముఠా తమ వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్లను వినియోగించి కట్‌ చేసారు. అందులోవున్న సుమారు 13కోట్ల 61లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను వారి వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకోన్నారు. తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌ ఇతర సామాగ్రిని బ్యాంక్‌లో వదిలి వేసారు. అక్కడి నుండి వెల్తూ సిసి కెమెరాలకు సంబంధించిన డివిఆర్‌ను కూడా ఈ ముఠా ఎత్తికెళ్లారు. చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్‌ కిరాయి తీసుకున్న ఇంటికి చేరుకొన్నారు. నిందితులు చోరీ సొత్తును ఏడు సమాన వాటాలు పంచుకున్నారు. నవంబర్‌ 19వ తేదీన నిందితులు మూడు బృందాలుగా వీడిపోయిన మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగివెళ్ళిపోయారు. ఈ భారీ మచోరీపై అప్రమత్తమైన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌ నేతృత్వంలో వర్థన్నపేట ఏసిపి నర్సయ్య, సిసిఎస్‌ ఏసిపి భోజరాజు, నర్సంపేట ఏసిపి కిరణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో పదికి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుల పట్టుకోవడం కోసం ఈ ప్రత్యేక పోలీస్‌ బృందాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టారు. నిందితుల కదలికలపై ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించి ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసారు. వారి నుండి చోరీ సోత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ భారీ చోరీని అతి స్వల్పకాలంలో చేధించడంతోపాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌, ఏసిపిలు నర్సయ్య,భోజరాజు,కిరణ్‌కుమార్‌, ఆత్మకూర్‌ ,రఘునాథ్‌పల్లి, సిసిఎస్‌, వర్థన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు చెందిన ఇన్స్‌స్పెక్టర్లు సంతోష్‌, శ్రీనివాసరెడ్డి, బాలాజీ వరప్రసాద్‌, శివకుమార్‌, రఘుపతిరెడ్డి, శ్రీనివాస్‌రావు, మహేందర్‌ రెడ్డి, అబ్బయ్య, పవన్‌కుమార్‌, విశ్వేశ్వర్‌, ఏఏఓ సల్మాన్‌పాషాతో* పాటు ఎస్‌ఐలు, ఇతర పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment