నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం: రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్సప్లోసివ్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు.
శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్కి చెందిన జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ (Passing Out Parade) పూర్తి చేసుకొని మూడు జాగిలాలు అందులో మూడు డాగ్స్ నార్కౌటిక్ డాగ్ (జెస్సి) గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపులో స్నిపర్ డాగ్ (రైడర్) ఎక్స్ప్లోజివ్ గుర్తింపులో ట్రాకర్ డాగ్ (టైసన్) వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సంవత్సర కాలం శిక్షణ పొంది కమిషనరేట్ కు రావడం జరిగింది. డాగ్స్, డాగ్స్ హాండ్లర్స్ శనివారం సీపీని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా సీపీ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ…… నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను, నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడంలో, ఎక్స్ప్లోజివ్స్, బాంబ్స్ ను గుర్తించిన విధంగానే డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు ఈ నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర ఉంటుందని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏఆర్ ఏసిపి ప్రతాప్, ఆర్ఐ లు వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, సిసి హరిష్, తదితరులు పాల్గొన్నారు.