తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఉత్సవాలకు సిద్ధమైన శివయ్యలు.

తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఉత్సవాలకు సిద్ధమైన శివయ్యలు..!!

మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉంటారు.

భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్ని శైవ క్షేత్రాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తారు. తెలంగాణలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

కొమురవెల్లి మల్లన్న

ఈ క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక్కడ శివరాత్రి రోజు వైభవంగా ఉత్సవాలు చేస్తారు. ఈ ఆలయంలోని మల్లికార్జునస్వామి విగ్రహాన్ని ‘పుట్టమన్ను’తో చేశారు. అది కూడా 500 సంవత్సరాల క్రితం. అయినా నేటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు స్వామి విగ్రహంలో నాభి వద్ద ‘పుట్టు లింగం’ ఉందని భక్తులు చెప్తుంటారు. యాదవుల ఆడపడచు ‘గొల్ల కేతమ్మ’ను, లింగ బలిజల ఆడపడచు ‘బలిజ మేడమ్మ’ను మల్లన్నస్వామి పెళ్లి చేసుకున్నారు.

అందుకే స్వామికి రెండు వైపులా.. గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించారు’ అని భక్తులు చెప్తుంటారు. ఇక్కడ ఏటా సంక్రాంతితో మొదలయ్యే ఉత్సవాలు ఉగాది వరకూ సాగుతాయి. అందులో భాగంగా నిర్వహించే ‘పట్నంవారం’ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.

కీసర గుట్ట

ఇది హైదరాబాదుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి భవానీసమేతుడై కొలువుదీరాడు. ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ‘శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు పరవశించి పోయి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నారు. అందుకోసం శ్రీరాముడు వారణాసి నుంచి లింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయుడికి చెప్పాడు. అయితే ఆంజనేయుడు సరైన లింగాన్ని ఎంచుకోలేక 101 శివ లింగాలను తీసుకొచ్చాడు.

కానీ అప్పటికే ముహూర్తం మించిపోవడంతో స్వయంగా శివుడే ప్రత్యక్షమై లింగాన్ని రాముడికి ఇచ్చాడు. హనుమంతుడు వచ్చే సరికి లింగ ప్రతిష్ఠ పూర్తయింది. తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేదనే కోపంతో లింగాలన్నింటినీ విసిరివేశాడు ఆంజనేయుడు. దాంతో కీ

Join WhatsApp

Join Now

Leave a Comment