ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ శంకరయ్య
కోరుట్ల, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శంకరయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఐదు వేల ( 5,000 ) రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణ మూర్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని అధినంలోనికి తీసుకున్న ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేస్తానని తెలపడంతో నిందితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.
ఐదు వేల ( 5,000 ) రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.