కాటారం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, మార్చి 20, సమర శంఖం ప్రతినిధి:-అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో బీఎల్ఎం గార్డెన్ లో రంజాన్ పండుగ మాసం పురస్కరించుకొని గురువారం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్లిం పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మత పెద్దలకు పండ్లను తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిరోజు ఉపవాసం చేస్తూ అల్లాను కొలుస్తున్న మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారిటీ సోదరులకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మైనారిటీలలో పేదలకు ఇండ్లు కనీస సౌకర్యాలను కల్పించే విధంగా ముందుకు పోతామని హామీ ఇచ్చారు. మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా వాసులందరికీ శ్రీధర్ బాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే , ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.