ఉపాధ్యాయులు ఇజాస్ మృతి బాధాకరం..రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాస్ ఆకస్మిక మృతి బాధాకరం అని, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందని.. రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడప నగరంలోని మృతుడు నివాసంలో ఇజాస్ కుటుంబ సభ్యులను రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి.. అంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆకతాయి చేష్టలు.. విద్య బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవ్వడం బాధాకరం అన్నారు. ఇటువంటి సంఘటనలు విద్యార్థి లోకానికే చెడ్డ పేరు తీసుకువస్తుందన్నారు. ఈ సంఘటనంపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారన్నారు. ఇజాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని.. ఇజాస్ మృతికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేపట్టి తెలుసుకుంటామన్నారు. ఉర్దూ పాఠాశాల అందరితో ఆప్యాయంగా, మంచిగా మాట్లాడే.. ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును, తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నామని తెలిపారు. అంతకు ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి మృతుని కుటుంబసబ్యలను పరామర్శించి, అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అభిమానులు పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment