విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి అబ్రహం లింకన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి  జిల్లాకలెక్టర్ ప్రతీక్ జైన్

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి అబ్రహం లింకన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి  జిల్లాకలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 6 సమర శంఖం:విద్యార్థులు గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు అయ్యేలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు సూచించారు.షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు గురువారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ప్రేరణ మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలపై తర్ఫీదు , మనోధైర్యాన్ని, వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు సునీత మేరీ, మాధవాచారి, వేణుగోపాల్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రేరేపకులు (మోటివెటర్స్) కె.రామచంద్రుడు, కె .మాధవి, మహేందర్, ఉదయ్ కుమార్, గోపీనాథ్, రమేష్ లు తరగతులను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు అతి సమీపంలో ఉన్నందున సమయం వృధా చేయకుండా, ప్రతి సబ్జెక్టులో తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నారు. ప్రేరణ మరియు శిక్షణ తరగతుల్లో మోటివేటర్స్ సూచించిన మెలకువలను పాటిస్తూ అతి సులభతరంగా అర్థం చేసుకొని అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేసే విధంగా విద్యార్థులకు విద్యార్థిని సన్నద్ధం కావాలనీ కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. చదువుకు పేద, ధనిక అనేది ఏది ఉండదని పట్టుదలతో ముందుకు వెళితే ఏదైనా సాధ్యపడుతుందని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాల్లో చదువుకున్న విద్యార్థులందరూ పేదరికం నుండి వచ్చిన వారు కాబట్టి చదువుతో మీ భవిష్యత్తును మార్చుకొని మీ తల్లిదండ్రులు గర్వించేలాగా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

  అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్రహం లింకన్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైన అమెరికాకు అధ్యక్షులుయ్యారని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదరికంతోపాటు సమాజంలో ఎంతో వివక్షతకు గురైనప్పటికీ తను లక్ష్య సాధన దిశగా పయనిస్తూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ ( స్టేషనరీ )అందించారు.  ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, సహాయ సంక్షేమ అధికారులు ఉమాపతి, వీరానందం, శుక్రవర్ధన్ రెడ్డి, వసతి గృహాల సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment