అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ను 3-0తో చిత్తు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ 214 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాంటింగ్ చేసిన టీమిండియా 356 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాంటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే తడబడింది. 34.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 214 పరుగులు చేసి మొత్తం 10 వికెట్లను కోల్పోయింది. టమ్ బాటమ్, గస్ అట్కిన్ సన్, బెన్ డకెట్ మినిహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రన్స్ చేయలేకపోయారు. తద్వారా ఇంగ్లండ్ భారీ ఓటమిని చవిచూసింది. భారత్ బ్యాటర్లలో శుభ్ మన్ గిల్ (112), కోహ్లీ (52), శ్రేయస్ అయ్యర్ (78), వికెట్ కీపర్ రాహుల్ 40 పరుగులు చేశారు. బౌలింగ్లోనూ టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. దీంతో మూడో వన్డేలో సునాయాసంగా విజయం సాధించారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Published On: February 13, 2025 8:05 am
