కన్హా శాంతి వనానికి సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి 

రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కన్హా గ్రామంలో కన్హా శాంతి వనం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య తో కలిసి సందర్శించారు. ఈ సందర్శనలో చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య  కూడా పాల్గొన్నారు.

ఈ సందర్శన సమయంలో కన్హా శాంతి వనం లో ఉన్న ఆధునిక వసతులు, పర్యాటకాలకు అందించే అనుభవాలు, ప్రదేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించి, ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం ఈ సందర్శనను జరిపిన ముఖ్యమంత్రి, తక్షణంలో పరిష్కారాలను తేవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment