ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాలేజీలకు హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి మంగళవారం కీలక ప్రకటన జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అటువంటి విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దుచేస్తామన్నారు.
సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్ రద్దు
Published On: January 8, 2025 9:47 am
