పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి ఇదే నిజం ఓదెల
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై పోత్కపల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి *09 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7100/- వేల రూపాయలు, 03 మొబైల్ ఫోన్లు, 4 టూ వీలర్స్ , పేక పత్తలు స్వాధీనం చేసుకున్నారు.పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేశ్5 మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై తో పాటు, కానిస్టేబుల్ రాజేందర్, ప్రశాంత్, రామకృష్ణ లు పాల్గొన్నారు. తదితరులు ఉన్నారు