శీర్షిక: ఓ శ్రామిక జీవి..!
ప్రకృతి వైపరీత్యమై కాటేసినా…
రుధిరాన్ని చెమటధారలుగా మార్చి
అదైర్య పడని నడకలతో
బీడుబడిన భూముల్లో
పచ్చని పైరులను పండించిన ఓ కృషీవల
నీకు వందనాలు ఓ శ్రామిక జీవి..!
అర్ధరాత్రి అపరాత్రి అనక రోగమొచ్చినా నొప్పులొచ్చినా… చట్టమొచ్చినా పక్కమొచ్చినా…
పచ్చని పైరు గొంతెండిన ప్రతిసారి గొంతు తడుపతూ
కోత కోసే సమయానికి అనుకోని అతిధిలా వడగళ్ల. వాన వచ్చి చేతికి వచ్చిన పంటను మింగేసి నప్పుడు కన్నీళ్ళను కను రెప్పల మాటున దాచుకొని
నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న నీకు వందనాలు
ఓ శ్రామిక జీవి..!
ఆరుగాలం కష్టించి
పంటను కంటికి రెప్పలా కాపాడుకొని
పంటనంతా విపణికి తరలిస్తే
అధికారుల నిర్లక్ష్యంతో
లారీల కొరత,గన్నీ సంచుల కొరత వల్ల ధాన్యం కాంట అటకెక్కి కూర్చొగా…
విశాదమంతా గుండెలో ఒంపుకుని
కన్నీళ్ళను కను రెప్పల మాటున దాచుకొని
నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న నీకు వందనాలు
ఓ శ్రామిక జీవి..!
పొలాల నడుమ
పురుగుబూషిల నడుమ
కాలం గడిపేస్తూ కష్టపడి తాను పస్తులు వుంటు
,మనకు అన్నం ముద్ద నోట్లోకి అందిస్తున్న
నీకు వందనాలు ఓ శ్రామిక జీవి..!
ప్రకృతి వైపరీత్యమై కాటేసినా
మట్టినే నమ్ముకుని…
తొలకరి జల్లుకై ఎదురుచూసే
ధైర్యానికి నీకు వందనాలు ఓ శ్రామిక జీవి..!
రైతే రాజుగా, రాజసంగా నిలవాలి
అలాంటి పరిస్థితులు మన కళ్ళముందే కదలాడాలి
అని కోరుకుంటూ …
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి), మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చరవాణి 9347042218.